
బిజినెస్

జూలై 18న నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
జూలై 18న నిర్వహించనున్న 'మా ఊరు వాడ' కార్యక్రమం ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించబడిందని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు www.rawntr.org పేరుతో అధికారిక ప్రకటన విడుదల చేసి, కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టవద్దని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!