
రాజకీయాలు

వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో పలుచోట్ల ఎండాకాలాన్ని తలపించే వాతావరణం నెలకొంది. ఈ సమయంలో వర్షాలు కురవాల్సి ఉండగా, గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4.6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాల ప్రభావం తగ్గడం, పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగడమే ఈ అసాధారణ ఉష్ణోగ్రతలకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు పెరిగితే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!