
క్రీడలు

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను సీఎం విజయ్ ఆవిష్కరించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు రూ.1,200 కోట్లను కేటాయించనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు మరింత ఆధునిక సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ కొత్త కాంప్లెక్స్ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఇదే సమయంలో చెన్నై అభివృద్ధికి సంబంధించి మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా ప్రతిపాదించారు. నగరంలో ఒలింపిక్ సిటీతో పాటు మోటార్ స్పోర్ట్స్ సిటీని నిర్మించే ప్రణాళికలను వెల్లడించారు. క్రీడా మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి వేదికల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఈ ప్రణాళికల ద్వారా స్పష్టమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!