

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో లోకేశ్ బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదన్నారు. సెప్టెంబర్ 9న తమ అధినేతపై అక్రమ కేసులు నమోదు చేసి అన్యాయంగా నిర్బంధించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఆ ఘటన తర్వాత ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును గుర్తు చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!