4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

Writer: Nithish 08:20 AM, 4 సెప్టెంబర్, 2026
నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సాగర్‌ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14న వినాయకచవితి పండుగలోపు నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

నీటి విడుదలపై స్పష్టత ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు, లేదంటే హాలియా నుంచి కోదాడ వరకు వేలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని కేటీఆర్‌ హెచ్చరించారు. కృష్ణా జలాలను సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సాగర్‌ నీటి అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ హయాంలో ఎడమకాల్వకు నీరివ్వకుండా కుడికాల్వకు నీరు విడుదల చేసిన సందర్భం లేదన్నారు. సాగర్‌ ఆయకట్టుకు నీరు అందక వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

ఇస్రో నుంచి జీఎస్‌ఎల్‌వీ విజయవంతమైన ప్రయోగం

ఇస్రో నుంచి జీఎస్‌ఎల్‌వీ విజయవంతమైన ప్రయోగం

ట్యాగ్లు
కేటీఆర్‌బీఆర్‌ఎస్‌నాగార్జునసాగర్‌శ్రీశైలం జలాశయంసాగర్‌ ఆయకట్టురైతు సమస్యలుకృష్ణా జలాలుతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్‌ ప్రభుత్వంనల్లగొండ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం
జనరల్

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
జనరల్

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌
జనరల్

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు
జనరల్

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు
సినిమాలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు
సినిమాలు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌
రాజకీయాలు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
సినిమాలు

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.
జనరల్

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!