

హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్కు 60 కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 57 రైళ్లు మూడు కోచ్ల చొప్పున నడుస్తున్నాయి. ప్రతి రేక్కు అదనంగా ఒక కోచ్ను జత చేయడంతో మూడు కారిడార్లలో ప్రయాణికుల సామర్థ్యం పెరగనుంది. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గ్ మార్గాల్లో మొత్తం 69.2 కిలోమీటర్ల మేర ఈ విస్తరణ జరగనుంది. ఒక్కో కోచ్కు సుమారు రూ.20 కోట్ల చొప్పున మొత్తం వ్యయం దాదాపు రూ.1,200 కోట్లు అవుతుందని అంచనా.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బెంగళూరులోని బీఈఎంఎల్కు ఈ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో కోచ్లను తయారు చేసిన హ్యుందాయ్ రోటెమ్. కొత్త కోచ్ల కోసం బీఈఎంఎల్కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కొనుగోలు ప్రక్రియకు డీఎంఆర్సీని కన్సల్టెంట్గా నియమించనున్నారు. 8–10 నెలల్లో కోచ్లను అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆర్డర్ తర్వాత తయారీకి సుమారు 15 నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మెట్రోలో రోజుకు సుమారు 4.6 లక్షల మంది ప్రయాణికులు 1,200 ట్రిప్పుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!