
జనరల్

చైనా-నేపాల్ సరిహద్దులో సంభవించిన భారీ వరదల్లో నేపాల్లో మృతుల సంఖ్య 1,114కు చేరుకుంది. మరో 3,916 మంది గల్లంతైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం వెల్లడించింది. ఈ నెల 26న సంభవించిన ఈ విపత్తు తర్వాత వారం రోజులకు మృతులు, గల్లంతైన వారి సంఖ్య భారీగా పెరిగింది.
చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం టిబెట్లో 16 మంది మృతి చెందగా, 546 మంది గల్లంతయ్యారు. దీంతో నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో కలిపి వరదల కారణంగా మృతుల సంఖ్య 1,130కి, గల్లంతైన వారి సంఖ్య 4,462కు చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!