
జనరల్

బండి భగీరథ్ నివాసంలో పోలీసులు నిర్వహించిన సోదాలు ముగిశాయి. అనంతరం ఆయన కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి గాలిస్తున్నారు. భగీరథ్ ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ సమాచారం సేకరిస్తున్నారు. అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకురావాలని పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!