
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్పై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించింది. తన రాజీనామాను శాసనమండలి చైర్మన్కు సమర్పించాలని పార్టీ స్పష్టం చేసింది.
ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రాజకీయ చర్చ మొదలైంది. రహ్మత్ బేగ్పై పార్టీ ఇంత కఠిన చర్య ఎందుకు తీసుకుందనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు చర్యలకు గల కారణాన్ని ఎంఐఎం అధిష్టానం అధికారికంగా వెల్లడించలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!