

మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కాంగ్పోక్సి జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు వాహనాలపై దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కోట్టిమ్, కోట్లెన్ గ్రామాల మధ్య ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. చురాచాంద్పూర్ నుంచి తిరిగి వస్తున్న థౌడా బాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులపై ఈ దాడి జరిగింది. మృతులను పుమ్తంగ్, పాస్టర్ పావ్గౌలెన్, పాస్టర్ కైగోలున్లుగా గుర్తించారు.
మృతులంతా బాప్టిస్ట్ చర్చి నాయకులని, వారు కుకీ వర్గానికి చెందిన వారని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. లామ్కాలో జరిగిన ఒక సదస్సుకు హాజరై తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, ఇతర భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!