
సినిమాలు

భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. రాత్రి 2 గంటల 26 నిమిషాలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైంది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా అనుభూతి చెందారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే భూప్రకంపనల కారణంగా స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!