

సందీప్ కిషన్ కథానాయకుడిగా జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన 'సిగ్మా' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆయన తన కుటుంబం, తండ్రి విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి విజయ్ సీఎం కావడం ఒక చారిత్రాత్మక విప్లవం అని పేర్కొంటూ, ఆ తర్వాత కుటుంబ సభ్యులందరిపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. విజయ్ వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. తాను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు, సొంతంగా పేరు, గుర్తింపు సంపాదించుకోవాలని, అవసరమైతే సహాయం చేస్తానని కానీ స్వయంగా ఎదగాలని విజయ్ సూచించారని తెలిపారు.
ఇక తన తల్లి సంగీత గురించి సరదాగా మాట్లాడుతూ, ఆమె "ఒక స్పైలా ఉంటారు" అని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి విషయం దాచినా ఆమెకు తెలిసిపోతుందని చెప్పారు. ఒకసారి అర్థరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఇంట్లో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారని గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకునే సమయానికి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని నవ్వుతూ వెల్లడించారు.

కామెంట్స్ (1)
All the best sanjay