
సినిమాలు

హైదరాబాద్లో మసాలా దినుసుల్లో భారీ కల్తీ వ్యవహారం వెలుగుచూసింది. ఇప్పటికే కారం, పాలు, నెయ్యి, వంటనూనెల్లో కల్తీ ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, తాజాగా మసాలా తయారీ కేంద్రాలపై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమాలు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో 25.3 టన్నుల కల్తీ మసాలాలు, 89.15 టన్నుల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సింథటిక్ రంగులు, వస్త్రాల రంగులు (క్లాత్ డైలు), టాల్కమ్ పౌడర్ వంటి హానికర పదార్థాలను ఉపయోగించి మసాలా దినుసులను కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!