
సినిమాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని తీవ్ర కలకలం రేగింది.
సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!