

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు సమగ్ర సంక్షేమం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ హైదరాబాద్లోని అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల కుటుంబాలకు ఉపాధి, ఉన్నత విద్య, నాణ్యమైన వైద్యం, గృహ వసతి, పెన్షన్, సామాజిక భద్రత వంటి అంశాలపై సమగ్ర సంక్షేమ విధానాలు అమలు చేయాలని వారు కమిటీకి సూచించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యార్థుల పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఉద్యమకారులకు కేవలం గుర్తింపు ఇవ్వడమే కాకుండా వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే విధంగా ప్రత్యేక సంక్షేమ విధానాలను రూపొందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు అందించిన సూచనలను నివేదికలో చేర్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!