
జనరల్

హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక పారిస్ ఫ్యాషన్ వీక్ 2026లో ఆమె వరుసగా మూడు రోజుల పాటు విభిన్న డిజైనర్ దుస్తులు, అద్భుతమైన వజ్రాభరణాలతో సందడి చేశారు. ఆమె స్టైలిష్ లుక్స్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
ముఖ్యంగా మూడో రోజు వేడుకలో సుధారెడ్డి ధరించిన వజ్రాభరణాల విలువ సుమారు రూ.250 కోట్లు అని సుధారెడ్డి ఫౌండేషన్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. విలాసవంతమైన జ్యువెలరీ, ఆకర్షణీయమైన ఫ్యాషన్ ఎంపికలతో ఆమె మరోసారి భారతీయ ప్రతినిధిగా అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ అరుదైన కలెక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!