
క్రీడలు

ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్కు సమీపంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భారీ ప్రకంపనల తర్వాత కూడా వరుసగా భూమి కంపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
సుమారు గంటన్నర వ్యవధిలో 5.0, 5.1, 6.1, 5.6, 5.9 తీవ్రతతో ఐదుసార్లు భూకంపాలు నమోదయ్యాయి. వరుస ప్రకంపనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఈస్ట్ నుసా టెంగారా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!