
సినిమాలు

విజయవాడకు చెందిన రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను నియమించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయికృష్ణ అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దర్యాప్తును వేగవంతం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
సాయికృష్ణ లాకప్ డెత్కు గురయ్యాడనే ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో, నేడు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నారు. తన కుమారుడు బతికే ఉన్నాడో లేదో స్పష్టత ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!