

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత్కు రావాల్సిన ఓ ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని దాటినట్లు సమాచారం. ఎంవీ సన్షైన్ అనే ఈ నౌక సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు భారత నౌకాదళంతో పాటు ఇతర ఏజెన్సీలు సహకారం అందిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి మొత్తం 15 ఎల్పీజీ నౌకలను సురక్షితంగా భారత్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ నౌకలో ఉన్న గ్యాస్ పరిమాణం, ఎప్పుడు భారత్ చేరుకుంటుందన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదే సమయంలో ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజమ్ ఘరీబబాదీ హర్మూజ్ పరిస్థితులు శాంతి నెలకొంటే గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. అమెరికా దౌత్యానికి కట్టుబడి లేదని విమర్శించారు. అంతర్జాతీయ చట్టాలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంటూ, శాంతి స్థిరపడితే సముద్ర భద్రత మరింత బలపడుతుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!