

ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రశంసలకు మంత్రి నారా లోకేశ్స్పందించారు. ఇది మనందరి సమిష్టి విజయమని పేర్కొంటూ పవన్ కల్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ మరియు ప్రభుత్వ సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు. అందరి సహకారంతో విద్యాశాఖను దేశానికి ఆదర్శంగా నిలుపుతానని చెప్పారు.
ఇక ముందు, పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా విద్యార్థులను అభినందిస్తూ, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం 4%కు పైగా పెరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు ఫలితాలను ఇచ్చాయని ఆయన అన్నారు. ముఖ్యంగా మెగా పేరెంట్-టీచర్ మీట్, 100 రోజుల ప్రణాళిక వంటి కార్యక్రమాలు ఈ విజయానికి దోహదపడ్డాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 72.8% నుంచి 78.39%కు పెరగడం గమనార్హమని పేర్కొన్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!