

ఆంధ్రప్రదేశ్–ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో నాలుగు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరిపిన ఫలితంగానే ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, విశాఖలోని ఎనర్జీ ట్రాన్సిషన్ సెంటర్తో కలిసి ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీని సోలార్ పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!