
సినిమాలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కొందరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించిన కుటుంబం ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో బాధితులు షాక్కు గురయ్యారు. దాదాపు రూ.5 కోట్లతో దంపతులు పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
నిందితుడు అశోక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి పారిపోయినట్లు సమాచారం. దీంతో బాధితులు అతని ఇంటి ముందు చేరి ఆందోళన చేపట్టారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!