

మంత్రి కొండా సురేఖ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణా కమిటీ నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించానని తెలిపారు. తనను, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులను నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సురేఖ కోరారు. పార్టీ క్రమశిక్షణపై తనకు పూర్తి గౌరవం ఉందని చెబుతూ, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!