
సినిమాలు

రాజస్థాన్లోని జైపూర్లో మరో పరీక్ష కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పారామెడికల్ డిప్లొమా పరీక్షలో విద్యార్థులను కాపీయింగ్ ద్వారా ఉత్తీర్ణుల్ని చేయడానికి ఓ ముఠా పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఇన్విజిలేటర్ల సహకారంతో విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పరీక్ష ప్రారంభానికి ముందే సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటనలో కళాశాల నిర్వాహకుడితో పాటు నలుగురిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో మరికొందరి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!