

యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో మహిళా సంఘాల రుణ వ్యవస్థలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్త్రీనిధి బకాయిలు సుమారు రూ.2 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వీవోఏలు కొందరు సభ్యులకు తెలియకుండానే వారి పేర్లపై రుణాలు తీసుకుని సొంత అవసరాలకు వినియోగిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.
ఈ కారణంగా పాత రుణాలు క్లియర్ కాకపోవడంతో కొత్త రుణాలు కూడా మంజూరు కావడం లేదని బాధితులు చెబుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆడిట్ నిర్వహించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
మండలంలో కొందరు వీవోఏలు సమావేశాల తీర్మానాల్లో కూడా మోసాలకు పాల్పడుతున్నారని, ముందస్తు సంతకాలు తీసుకుని వాటిని తమకు అనుకూలంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!