

ఇరాన్ అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను తమ గగనతలంలో కూల్చివేసినట్లు ప్రకటించింది. అలాగే ఆర్క్యూ-4 డ్రోన్, ఎఫ్-35 యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపింది. టెహ్రాన్లో అమెరికా దాడుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అమెరికా చేసే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని ఐఆర్జీసీ వెల్లడించింది. అమెరికా మరోసారి సైనిక చర్యలు ప్రారంభిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, మొజ్తాబా ఖమేనీ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల సమయంలో దాడులు సహించబోమని, పశ్చిమాసియాలో అమెరికాకు ఎక్కడా సురక్షిత స్థలం ఉండదని హెచ్చరించారు. మరోవైపు, అమెరికా అధికారులు తమ దాడులు ఆత్మరక్షణ కోసమే జరిగాయని తెలిపారు. సముద్రంలో మైన్స్ అమర్చే ప్రయత్నాలు, క్షిపణి లాంచ్ప్యాడ్లను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. ఈ దాడుల్లో బందర్ అబ్బాస్ పోర్ట్లోని నౌకాదళ స్థావరం దెబ్బతిన్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!