

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చల్లని ఐస్క్రీమ్లు, పండ్ల రసాలకు నగరంలో భారీగా డిమాండ్ పెరిగింది. అయితే హైదరాబాద్ లోని సైదాబాద్, చంపాపేట్, సంతోష్నగర్, యాకుత్పురా, మలక్పేట్, చాదర్ఘాట్ ప్రాంతాల్లో గడువు ముగిసిన ఐస్క్రీమ్లపై కొత్త తేదీలు ముద్రించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే కుళ్లిపోయిన పండ్లను కృత్రిమ రంగులు, సువాసనలు, అధిక చక్కెర కలిపి పండ్ల రసాలుగా అమ్ముతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
వైద్య నిపుణుల ప్రకారం నాసిరకం పాల ఉత్పత్తులు, రసాయనాలు కలిపిన పండ్ల రసాలు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రత శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!