
జనరల్

తమిళనాడులో రాజకీయంగా సంచలనం రేగింది. టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు అసెంబ్లీ స్పీకర్పై ప్రతిపాదిత అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.35 కోట్లు ఇస్తామని భారీ ఎర వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐపీడీఎస్ ప్రతినిధినని చెప్పుకున్న తిరునావుక్కరసు అనే వ్యక్తి ఫోన్ చేసి ఈ ఆఫర్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన తిరస్కరించడంతో తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై చెన్నై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి తిరునావుక్కరసుతో పాటు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ ఫోన్ కాల్ మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ ఆదేశాల మేరకే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!