

ఏఐజీ ఆసుపత్రులు ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి వడదెబ్బను సాధారణ నీరసం లేదా డీహైడ్రేషన్గా భావించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇది మెదడు, గుండె, కిడ్నీలపై వేగంగా ప్రభావం చూపే అత్యవసర పరిస్థితి అని తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏఐజీ ఆసుపత్రి ‘బీట్ ది హీట్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హీట్ స్ట్రోక్లో అత్యంత ప్రమాదకర సంకేతం చెమట పట్టకపోవడమని వైద్యులు పేర్కొన్నారు. మొదట అలసట, తల తిరగడం, వికారం కనిపిస్తాయని, తర్వాత గందరగోళం, మాట తడబడటం, ఫిట్స్, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
హీట్ స్ట్రోక్లో తొలి ఐదు నిమిషాలు అత్యంత కీలకమని వైద్యులు సూచించారు. బాధితుడిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి తరలించి, గాలి తగిలేలా చేయాలని చెప్పారు. తడి వస్త్రాలతో శరీరాన్ని తుడవడం, మెడ, చంకలు, గడ్డల వద్ద ఐస్ ప్యాక్లు పెట్టడం ద్వారా శరీరాన్ని చల్లబరచాలని సూచించారు. విపరీతమైన వేడి గుండెపై ఒత్తిడి పెంచుతుందని, డీహైడ్రేషన్ వల్ల ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, ఎండలో పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోజూ తగినంత నీరు తాగడం, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి వెళ్లకపోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఆల్కహాల్ మరియు కెఫీన్ పానీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!