

భోగాపురంలో నిర్వహించిన విశిష్ట కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై సంప్రదాయ ధింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు పాటించబడినట్లు ధృవీకరించారు. అనంతరం అధికారిక ధ్రువపత్రాన్ని మంత్రి సంధ్యారాణికి అందజేశారు.
మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఇది కేవలం రికార్డు మాత్రమే కాకుండా గిరిజన సంస్కృతికి లభించిన అంతర్జాతీయ గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిరిజన కళలు, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అధికారులు, పోలీసు శాఖ, స్వచ్ఛంద సేవకులందరికీ అభినందనలు తెలిపారు. ఈ రికార్డు గిరిజన కళలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపును తీసుకువస్తుందని ఆమె స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!