

విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రణబాలి’ విడుదలపై నెలకొన్న అనుమానాలకు చిత్రబృందం తెరదించింది. సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని స్పష్టం చేసింది. గతంలో ఈ నెల 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 16కి వాయిదా పడింది. అయితే ఇటీవల మరోసారి విడుదల తేదీ మారుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో స్పందించిన చిత్రబృందం.. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపింది.
ఇప్పటికే తొలి భాగానికి సంబంధించిన నేపథ్య సంగీతం పనులు కూడా పూర్తయ్యాయని వెల్లడించింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి, ప్రకటించిన తేదీకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు తెరపడింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!