
జనరల్

ఉద్యోగులు, పింఛన్దారుల బకాయిల చెల్లింపుల కోసం ఆర్థికశాఖ మరో రూ.2 వేల కోట్లను విడుదల చేసింది. గత నెలలో కూడా ఇదే మొత్తాన్ని విడుదల చేయగా, ఇప్పటివరకు మొత్తం రూ.4 వేల కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. 100 రోజుల్లో రూ.6,000 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ చర్యలు కొనసాగుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ బకాయిలు పూర్తిగా చెల్లించినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా పూర్తిగా చెల్లించినట్లు పేర్కొంది. చిన్న బిల్లులను కూడా గుర్తించి చెల్లించినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!