
క్రీడలు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇంధన కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దేవాస్ పట్టణంలోని రాధాగంజ్ ప్రాంతానికి చెందిన గోపాల్ ఠాకుర్ అనే బ్యాంకు ఉద్యోగి గుర్రంపై ఆఫీసుకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏయూ ఫైనాన్స్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన, బుల్లెట్ బైక్లో పెట్రోలు కోసం బంక్ వద్దకు వెళ్లగా భారీ క్యూ చూసి వెనుదిరిగారు. ఈ ఘటనను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఇంటి వద్ద సరదా కోసం కొనుగోలు చేసిన గుర్రాన్ని ఉపయోగించాలనే ఆలోచనతో గోపాల్ ఠాకుర్ దానిపై ఆఫీసుకు బయలుదేరారు. సుమారు 3 కిలోమీటర్ల దూరాన్ని వేగంగా పూర్తి చేసి, నిర్ణీత సమయానికి ముందే ఆఫీసుకు చేరుకుని హాజరు నమోదు చేశారు. ఇంధన సమస్యల మధ్య సాధారణ ప్రజలు ఎలా వినూత్న మార్గాలు అనుసరిస్తున్నారో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!