
సినిమాలు

దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. కిలో సీఎన్జీపై రూ.2 పెంపు నిర్ణయం మే 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెలలో సీఎన్జీ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.83.09కు చేరింది. మే 15న రూ.2, మే 18న రూ.1, మే 23న మరో రూ.1 చొప్పున ధరలు పెరిగాయి.
మొత్తంగా గత 11 రోజుల్లో సీఎన్జీ ధర కిలోకు రూ.6 పెరిగింది. హర్మూజ్ జలసంధిలో ఏర్పడుతున్న అంతరాయాలు, ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు ముడి చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని చమురు సంస్థలు చెబుతున్నాయి. సీఎన్జీ ధరల పెరుగుదలతో క్యాబ్ డ్రైవర్లు, ఆటో రిక్షా యజమానుల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. అలాగే లాజిస్టిక్స్ వ్యయం పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!