

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, డీప్ఫేక్లు, తప్పుడు సమాచారం, నకిలీ చిత్రాలు, కాపీరైట్ ఉల్లంఘనలు, గోప్యత సమస్యలను నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేసే సంస్థలు, వాటిని వినియోగించే వేదికలపై పారదర్శకత, భద్రతకు సంబంధించిన బాధ్యతలను విధిస్తున్నాయి.
కొత్త మార్గదర్శకాల ప్రకారం కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, పాఠ్య సమాచారం వంటి కంటెంట్కు తప్పనిసరిగా గుర్తింపు ఇవ్వాలి. డీప్ఫేక్ కంటెంట్కు కృత్రిమ మేధస్సుతో రూపొందించినట్లు స్పష్టమైన గుర్తింపు ఉండాలి. కృత్రిమ మేధస్సు చాట్బాట్లతో మాట్లాడుతున్నప్పుడు వినియోగదారులకు ముందుగానే సమాచారం అందించాలి. బయోమెట్రిక్ డేటా వినియోగం, భావోద్వేగాలను విశ్లేషించే వ్యవస్థలు, భారీ కృత్రిమ మేధస్సు నమూనాల అభివృద్ధిపైనా ఈ నిబంధనలు వర్తిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలు ప్రపంచ కృత్రిమ మేధస్సు రంగానికి కొత్త ప్రమాణాలను తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!