
ఓటీటీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మికి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. గతంలోనూ ఆమెకు సమన్లు జారీ చేసిన ఈడీ, తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ విచారణకు పిలిచింది.
ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ కంపెనీతో ఉన్న లావాదేవీలు, అలాగే రాజ్ కసిరెడ్డి లింకులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కామ్ లాభాల్లో వాటా ఉన్నట్టు అనుమానిస్తూ విచారణను కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించే దిశగా ఈడీ చర్యలు తీసుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!