
జనరల్

ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి, కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎబోలా అలర్ట్ ప్రకటించారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సింగపూర్ నుంచి 185 మంది ప్రయాణికులతో వచ్చిన విమానంలోని ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుల ద్వారా వచ్చే పర్యాటకులు, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!