
సినిమాలు

తూప్రాన్ సమీపంలోని జాతీయ రహదారి-44పై గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగపూర్ నుంచి కాకినాడకు కొత్త కార్లను తీసుకెళ్తున్న కంటైనర్ లారీ ఇంజిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లారీ మొత్తం మంటల్లో చిక్కుకుంది. నాగులపల్లి బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ఘటనలో లారీలో ఉన్న ఎనిమిది కొత్త కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!