

‘కాక్రోచ్ జనతా పార్టీ’ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ వైరల్ ట్రెండ్గా మారింది. ఈ వ్యంగ్య రాజకీయ ఉద్యమానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజీ 8.8 మిలియన్ల ఫాలోవర్లను దాటేసి, బీజేపీ అధికారిక పేజీ (8.7 మిలియన్లు)ను వెనక్కి నెట్టడం సంచలనంగా మారింది. అంతేకాకుండా 13.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న కాంగ్రెస్ను కూడా త్వరలో దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నుంచి ప్రేరణ పొంది ఈ సెటైరికల్ మూవ్మెంట్ మొదలైంది. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే యువకుడు ఈ ఇన్స్టా పేజీని క్రియేట్ చేసి ఏఐ ఆధారిత వ్యంగ్య వీడియోలు, పోస్టులు షేర్ చేస్తున్నాడు. కేవలం ఐదు రోజుల్లోనే భారీ ఫాలోయింగ్ సాధించడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ పార్టీలో చేరాలంటే “నిరుద్యోగి, బద్ధకం ఎక్కువ, 24 గంటలు ఆన్లైన్లో ఉండాలి” వంటి వ్యంగ్య అర్హతలు ఉండటం వైరల్గా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!