

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్మికులకు శుభవార్త తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో కనీస వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.11 కోట్ల మంది కార్మికులకు లాభం కలగనుంది.
కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ కేటగిరీలుగా విభజించి, రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు. జోన్-1లో కనీస వేతనాలను గణనీయంగా పెంచారు. ఈ కొత్త వేతన విధానం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని సీఎం తెలిపారు. నైపుణ్యాలు పెంచుకుంటే విదేశాల్లో రూ.2 లక్షల వరకు వేతనం పొందవచ్చని పేర్కొన్నారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉన్నప్పటికీ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉండదని చెప్పారు. అలాగే ప్రతిపక్షంపై కూడా ఆయన విమర్శలు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!