
క్రీడలు

తీవ్ర వడగాలుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించి ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి స్థానిక సెలవులు ప్రకటించాలని సూచించారు.
జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సీఎం తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు మధ్యాహ్న వేళల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో హీట్ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!