
జనరల్

నటి అషు రెడ్డిపై మోసం ఆరోపణలతో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సీసీఎస్లో నమోదైన ఈ కేసులో, ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లను తీసుకుని మోసం చేసినట్లు బాధితుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో అషు రెడ్డి పేరిట ఉన్న ఒక వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశమైంది.
ఆ ఆడియోలో మే నెలలో రూ.1.5 కోట్లు తిరిగి చెల్లిస్తానని, మిగిలిన మొత్తాన్ని తరువాత సెటిల్ చేస్తానని చెప్పినట్లు వినిపిస్తోంది. అలాగే వేధింపులు కొనసాగితే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి బ్యాంకు లావాదేవీ వివరాలను సేకరించడంతో పాటు ఆడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. త్వరలోనే అషు రెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశముంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!