

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలు, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్ద ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి, పోలీసులు, స్పీకర్పై కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ప్రస్తుతం ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జగదీశ్రెడ్డి విమర్శించారు. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన వీడియోలను ఆధారంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ అంశాలన్నింటిపై ఢిల్లీలోని సంబంధిత జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేసి, తమ వాదనను వినిపించనున్నట్లు జగదీశ్రెడ్డి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!