

అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఒక బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రక్షణ శాఖ, ఇప్పుడు రెండో యూనిట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తోంది.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఈ యూనిట్ను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మోస్ బృందానికి అవసరమైన భూములను అందిస్తామని హామీ ఇవ్వగా, ఆ ప్రాంతాన్ని పరిశీలించిన బృందం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం, జాతీయ రహదారి-44కు అనుసంధానం ఉండటం వంటి అంశాలు ఈ ప్రాంతానికి అదనపు ప్రయోజనాలుగా నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!