
సినిమాలు

హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్కు వస్తున్న లుఫ్తాన్సా విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపినట్లు సమాచారం. విమానం శంషాబాద్ చేరుకునేలోపు పేల్చేస్తామని మెయిల్లో హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే దాన్ని ఐసోలేషన్ బేకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది మొత్తం విమానాన్ని పరిశీలిస్తూ ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!