
సినిమాలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్ని జిల్లాల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎబోలాపై అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయాలతో పాటు ఓడరేవులు, రోడ్డు మార్గాల వద్ద కూడా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వైరస్ లక్షణాలు కనిపించే వ్యక్తులను క్వారంటైన్లో ఉంచుతామని మంత్రి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!