
క్రీడలు

తిరుమల నడక మార్గంలో శుక్రవారం రాత్రి చిరుత కనిపించడం భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో నడక మార్గాన్ని వేగంగా దాటుతూ వెళ్లిన చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు.
భక్తులు ఒక్కసారిగా పెద్దగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి పరుగులు తీసింది. సమాచారం అందుకున్న విజిలెన్స్, అటవీశాఖ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని భక్తులను అప్రమత్తం చేశారు. నడక మార్గంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!