
టెక్నాలజీ

సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్కాస్ట్లో నిర్వహించిన హెచ్ఎంఎస్ గేట్ మీటింగ్లో హెచ్ఎంఎస్ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికులతో మాట్లాడకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రాంగణంలో పోలీసుల ప్రవేశం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ, తమను అడ్డుకున్న పోలీసులపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని కవిత ఆరోపించారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు కార్మికుల హక్కులను కాపాడడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేవలం రెండు పడకల ఆస్పత్రితో కార్మికులకు ఆరోగ్య భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!