
ఓటీటీ

నందమూరి హీరో కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లోకి అధికారికంగా అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకు ఈ ప్లాట్ఫామ్కు దూరంగా ఉన్న ఆయన, తన పుట్టినరోజు సందర్భంగా జూలై 5న ఉదయం 10:11 గంటలకు ప్రత్యేక పోస్టుతో ఇన్స్టాగ్రామ్ ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన బృందం ప్రకటించింది.
అభిమానులతో మరింత చేరువ కావడం కోసం వ్యక్తిగత విషయాలు, సినిమా అప్డేట్స్, షూటింగ్ విశేషాలు, తెరవెనుక సంగతులను ఇకపై ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకోనున్నారు. ప్రస్తుతం కల్యాణ్ రామ్, వెంకటేశ్తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!