
జనరల్

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నర్మదా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 22 స్థానాలకు గాను 15 స్థానాలను గెలుచుకుని పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. అదేవిధంగా 12 తాలూకా పంచాయతీలపై కూడా ఆధిపత్యం సాధించింది. ఈ విజయానంతరం రాజ్పిప్లాలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అరవింద్ కేజ్రివాల్ పాల్గొన్నారు.
ఈ విజయానికి గిరిజన నాయకుడు, పార్టీ శాసనసభ్యుడు చైతర్ వాసవ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల ఆధిపత్యాన్ని చెరిపేసి మూడో పార్టీగా జిల్లా స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!